ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. ఉదయం దాటితే చాలు భానుడి ప్రతాపం మొదలవుతోంది. మొన్నటి వరకు కూడా తేలికపాటి వర్షాలు కురువటంతో… కాస్త ఉపశమనం దొరికినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో… ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్ల వడగాలులు కూడా వీస్తున్నాయి.
16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు….

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. ఇవాళ ఏపీలోని 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు ఉన్నాయి. ఇక పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం ఉండనుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని అంచనా.
మరో 68 మండలాల్లో ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం - 7, పోలవరం - 2, ఏలూరు - 1, కృష్ణా- 5, ఎన్టీఆర్ - 9, గుంటూరు 16, బాపట్ల 1, పల్నాడు 21, ప్రకాశం జిల్లాల్లోని 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. ఆదివారం18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
శుక్రవారం నంద్యాల జిల్లాలోని గుల్లదుర్తిలో 42.1 డిగ్రీలు, కడప జిల్లాలోని కమలాపురంలో 42 డిగ్రీలు, పల్నాడు(జి) గురజాల, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 41.6°C, కర్నూలు(జి) తోవిలో 41.4°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఏలూరు జిల్లాలోని ధర్మాజీగూడెంలో 40.4°C, మార్కాపురం(జి) బొట్లగూడూరు 40.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె 40.1°C, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఇక ఏలూరు జిల్లాలోని ధర్మాజీగూడెంలో 40.4°C, మార్కాపురం(జి) బొట్లగూడూరు 40.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె 40.1°C, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు.