శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సుమారు 120.9532 టీఎంసీలుగా ప్రస్తుతం నమోదైంది. అలాగే జలాశయ నీటి మట్టం దాదాపు 864.60 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. జూరాల ప్రాజెక్ట్, స్పిల్వే, సుంకేసుల, హంద్రీ ప్రాంతం లేదా పరివాహక ప్రాంతం నుండి జలాశయానికి ఎటువంటి నీటి ప్రవాహాలు లేవని అధికారులు తెలిపారు.

తెలంగాణకు చెందిన ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందుకోసం సుమారు 41,075 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఎగువ నుంచి నీటి రాక లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తికి నీటిని నిరంతరం వినియోగిస్తుండటంతో, శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో కృష్ణా బేసిన్లోకి కొత్తగా నీరు వచ్చే సూచనలు ఏమీ లేనందున, నీటి నిల్వ స్థాయి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు
శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది.
సాధారణ దర్శనంతో పాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. స్వామివార్ల దర్శనానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్జిత అభిషేకాలు, శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమార్చన పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీని క్రమబద్ధీకరించడానికి పోలీసు శాఖ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్లలో తోపులాటలు జరగకుండా నిఘా కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
{{/usCountry}}భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీని క్రమబద్ధీకరించడానికి పోలీసు శాఖ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్లలో తోపులాటలు జరగకుండా నిఘా కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
{{/usCountry}}వరుసగా వచ్చిన సెలవుల కారణంగా సోమవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రానికి వచ్చే భక్తులు దేవస్థాన నిబంధనలను అనుసరించి సహకరించాలని, భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.