ఆంధ్రప్రదేశ్లో రాగల 24 గంటల్లో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరంలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అప్రమత్తత అవసరమని అధికారులు తెలిపారు:
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే ముప్పుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
'వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వేళల్లో పిడుగులు పడొచ్చు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.' అని అధికారులు సూచించారు.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో కొన్ని చోట్లు పిడుగులతో పడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వర్షం పడుతున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదు. ఈదురుగాలుల ధాటికి హోర్డింగులు, పురాతన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి. సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉన్నందున చిన్న పడవలు, బోట్లతో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}వర్షం పడుతున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదు. ఈదురుగాలుల ధాటికి హోర్డింగులు, పురాతన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి. సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉన్నందున చిన్న పడవలు, బోట్లతో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}తీరప్రాంత ప్రజలు స్థానిక అధికార యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. మరోవైపు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 66.7 మి.మీ, పెంజెరువులో 42.5 మి.మీ, సోమలింగపాలెంలో 40 మి.మీ మేర వర్షపాతం రికార్డయింది.