వర్షాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో పగటి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇందులో ఎల్ నినో(El Nino) పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక, గణాంక శాఖ వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రం ప్రాంతంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

సాయంత్రం 4 గంటల సమయానికి, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో 40.9 డిగ్రీలు, ఒంగోలు సమీపంలోని త్రోవగుంట, తిరుపతి జిల్లాలోని బోనుపల్లిలో 40.8 డిగ్రీలు, అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీలు నుండి 39 డిగ్రీలు మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విజయవాడ, అమరావతిలో వరుసగా 38.9 డిగ్రీలు, 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అమరావతిలోని భారత వాతావరణ శాఖ సోమవారం నాడు బాపట్ల, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. జూలై 15 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పులు, పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక, గణాంక శాఖ ప్రకారం జూన్ 1 నుండి జూలై 12 మధ్య రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 154 మి.మీ. కాగా కేవలం 86.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల మొత్తం 44 శాతం లోపం ఏర్పడింది. రాబోయే వారంలో వర్షాలు లేకపోవడం లేదా చాలా తక్కువగా కురవడం పరిస్థితి మరింత తీవ్రతరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని 28 జిల్లాల్లో 27 జిల్లాలు వర్షపాత లోపాన్ని నమోదు చేశాయి.
జులై 12 నాటికి సాధారణ వర్షపాతం నమోదైన అనంతపురం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ వర్షాలు లేక అల్లాడుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షపాత లోపం నమోదైంది. ఈ జిల్లాల్లో లోపం శాతం 61 శాతం నుండి 65 శాతం మధ్య ఉంది.
{{/usCountry}}జులై 12 నాటికి సాధారణ వర్షపాతం నమోదైన అనంతపురం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ వర్షాలు లేక అల్లాడుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షపాత లోపం నమోదైంది. ఈ జిల్లాల్లో లోపం శాతం 61 శాతం నుండి 65 శాతం మధ్య ఉంది.
{{/usCountry}}కోనసీమ జిల్లాలో నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు, సాధారణ వర్షపాతం 201.9 మి.మీ కాగా కేవలం 77.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరిలో సాధారణ వర్షపాతం 196.6 మి.మీ ఉండగా 68.7 మి.మీ, అన్నమయ్య జిల్లాలో సాధారణ వర్షపాతం 118.1 మి.మీ ఉండగా 48.1 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి.
తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా వర్షపాత లోటు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ లోటు శాతం 50 శాతం దాటింది. ఈ ఏడాది అత్యంత తీవ్రమైన ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.