...
...
Next Story

AP Weather Update : ట్రోపో ఆవరణంలోని గాలుల ప్రభావం - రాబోయే 2 రోజులు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు - వాతావరణశాఖ

Rain Alert to Andhra Pradesh :ట్రోపో ఆవరణంలో ఏర్పడిన గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Published on: May 07, 2026 05:44 PM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం (మే 8) కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది.

ఈ జిల్లాలకు వర్ష సూచన….

ఏపీకి వర్ష సూచన (image source apsdma)
ఏపీకి వర్ష సూచన (image source apsdma)

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం….. రేపు(మే 8) అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 9వ తేదీన కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షితమైన భవనాల్లో ఉండాలని కోరారు.

మరోవైపు వడగాలులు..

రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వర్ష సూచన ఉండగా….. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి జిల్లాలోని జీకే వీధిమండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ముంచింగిపుట్టు, పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe