తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉపరితల గాలులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- జులై 28(ఇవాళ) నుంచి జులై 29 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు.
- జులై 29 నుంచి జులై 30 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- జులై 30 నుంచి జులై 31 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు :
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ (జూలై 28) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుసే సూచనలున్నాయి.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం పడే సమయంలో బయట ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, ప్రకటనల బోర్డులు (హోర్డింగ్స్) మరియు విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచనలు చేశారు. ముఖ్యంగా
{{/usCountry}}ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం పడే సమయంలో బయట ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, ప్రకటనల బోర్డులు (హోర్డింగ్స్) మరియు విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచనలు చేశారు. ముఖ్యంగా
{{/usCountry}}