Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో వర్షాలు…

ఇవాళ(జూలై 30) పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఈదురుగాలుల హెచ్చరికలు..
మరోవైపు రాయలసీమ ప్రాంతాలైన మార్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది. ఈదురుగాలుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలువర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
"వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి" అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో…. వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, ఎత్తైన విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ల వద్ద గానీ నిలబడకూడదు. బలమైన గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లను గమనిస్తూ…. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.
వర్షం కురిసే సమయంలో అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని… వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}వర్షం కురిసే సమయంలో అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని… వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}