ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తా తీరం వరకు ద్రోణి

ప్రస్తుతం బీహార్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు… శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో…… వాతావరణంలో మార్పులు ఉండనున్నాయి.
- కోస్తాంధ్ర : ఈ ప్రాంతంలో గురువారం వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.
- రాయలసీమ : రాయలసీమ జిల్లాల్లో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
- ఈదురుగాలులు : వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 40-50కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ముఖ్యంగా ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు చెట్ల కింద ఉండటం ప్రాణాంతకమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడటం ఏమాత్రం క్షేమం కాదని స్పష్టం చేసింది.
{{/usCountry}}ముఖ్యంగా ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు చెట్ల కింద ఉండటం ప్రాణాంతకమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడటం ఏమాత్రం క్షేమం కాదని స్పష్టం చేసింది.
{{/usCountry}}“వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, పొలాల్లో ఉన్న పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.