AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా….. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావంతో వర్షాలు….

వాతావరణశాఖ అంచనాల ప్రకారం….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ద్రోణి ప్రభావంతో రానున్న మంగళవారం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఫలితంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ జాబితాలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అనేక జిల్లాలు ఉన్నాయి.
- ఉత్తర కోస్తా: అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు.
- మధ్య కోస్తా: కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు.
- దక్షిణ కోస్తా - రాయలసీమ: ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలు.
“ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వల్ల పిడుగుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని… సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని సూచించింది.
వర్షాల హెచ్చరికలు ఒకవైపు ఉన్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ముఖ్యంగా పోలవరం, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో 'తీవ్ర వడగాల్పులు' వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}వర్షాల హెచ్చరికలు ఒకవైపు ఉన్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ముఖ్యంగా పోలవరం, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో 'తీవ్ర వడగాల్పులు' వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}అల్లూరి జిల్లా పరిధిలోని జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, చింతూరు, మారేడుమిల్లి, గుర్తేడు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం (అర్బన్ - రూరల్), రాజానగరం, గోకవరం, కోరుకొండ. కోనసీమతో పాటు ఏలూరు జిల్లాల్లోని ఆత్రేయపురం, వేలేరుపాడు మండలాల్లోనూ వేడి గాలులు తీవ్రంగా ఉండే సూచనలున్నాయి.
తెలంగాణకు వర్ష సూచన:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలకు ఉపశమనం లభించనుంది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ(మే 9) తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మే 10వ తేదీన రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక మే 11వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.