రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2,08,406 కోట్ల విలువైన 25 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్రంలో పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను నేరుగా 'ఎస్క్రో ఖాతాల' (Escrow Accounts) లోకి జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే, ప్రాక్టికల్గా ఎంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలమో నిర్ణయించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఆయా ప్రాంతాల సమగ్ర వికాసానికి బాటలు వేయాలని తెలిపారు.
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, అదే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేలా మిగిలిన 37 MSME పార్కుల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని గడువు విధించారు.
వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు.
దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
పరిశ్రమల స్థాపనపై కొందరు రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, నీటి వినియోగంపై ఉన్న అపోహలను తొలగించాలని ఆదేశించారు.
{{/usCountry}}పరిశ్రమల స్థాపనపై కొందరు రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, నీటి వినియోగంపై ఉన్న అపోహలను తొలగించాలని ఆదేశించారు.
{{/usCountry}}విశాఖపట్నంలోని పరిశ్రమలకు పొలవరం ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ఫ్లో ద్వారా పుష్కలంగా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్ ప్రాజెక్టులు, హిందూపూర్ సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయాలని తెలిపారు.రాయలసీమ ప్రాంతపు ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్డు, రైలు మరియు పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో నిర్మించే హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు ప్రత్యేకమైన విశిష్ట నిర్మాణ శైలి కలిగి ఉండి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు.