...
...
Next Story

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ వాహన సేవ?

శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మెుదలుకానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published on: Feb 26, 2026, 06:45:16 IST
Advertisement

సత్య సాయి జిల్లాలోని శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక 15 రోజుల బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 13 వరకు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 27న అంకురార్పణ, 28న ద్వజారోహణం, శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాహన సేవల్లో భాగంగా మార్చి 1న హంస వాహనం, మార్చి 2న సింహ వాహనం, మార్చి 3న హనుమంత వాహనం, మార్చి 4న గరుడ వాహనం, మార్చి 5న శేషవాహనం, 6న చంద్రప్రభ వాహనం ఉంటుంది. మార్చి 7న మోహిని ఉత్సవం, మార్చి 8న ప్రజా గరుడ సేవ, మార్చి 9న గజవాహనం.. మార్చి 10న బ్రహ్మ రథోత్సవం నిర్వహించగా, మార్చి 13న పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(ఫైల్ ఫొటో)
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(ఫైల్ ఫొటో)

దేశంలోనే మూడో అతిపెద్ద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని బ్రహ్మ రథోత్సవానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. భారీ ఆలయ రథానికి ప్రత్యేకంగా తాళ్లను సాంప్రదాయకంగా తయారు చేస్తారు. 125 సంవత్సరాల పురాతనమైన ఈ రథం, 37.5 అడుగుల ఎత్తు, దాదాపు 540 టన్నుల బరువు కలిగి ఉంది. దక్షిణ భారతదేశం అంతటా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని సత్య సాయి జిల్లా కలెక్టర్ ఎం.శ్యామ్ ప్రసాద్, పోలీసు సూపరింటెండెంట్ ఎస్.సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, బారికేడింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను అధికారులు సమీక్షించారు. అన్ని విభాగాలు దగ్గరి సమన్వయంతో పనిచేయాలని, వసతి, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, వైద్య సౌకర్యాల కోసం ముందస్తు ఏర్పాట్లను చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తామని, రాష్ట్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe