శాంతిభద్రతలను కాపాడటం అత్యంత ముఖ్యమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరులో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడులు జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

శాంతిభద్రతల పరిరక్షణ చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలను సహించబోమని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసనలు జరగడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 189 (2), 190, 292, 324 (4) కింద ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 66/2026) నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ ఇంటికి పలువురు నిప్పు అంటించారు.
ఈ ఘటనలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. చట్టబద్ధమైన పాలన అన్ని సమయాల్లో కొనసాగాలని అన్నారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య, రాజ్యాంగ మార్గాల ద్వారా మాత్రమే వ్యక్తీకరించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పౌరులందరికీ శాంతి, భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా, దృఢంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని కోరారు. ప్రజా భద్రత, పౌరుల భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొన్నారు.
{{/usCountry}}శాంతిభద్రతలకు భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పౌరులందరికీ శాంతి, భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా, దృఢంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని కోరారు. ప్రజా భద్రత, పౌరుల భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొన్నారు.
{{/usCountry}}