దాదాపు ఒక వారం పాటు 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అల్లాడిపోయిన తర్వాత.. బుధవారం (మే 27) నాడు వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు ఉపశమనాన్ని కల్పించాయి. ఒక వారం కంటే ఎక్కువ కాలం తర్వాత.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో రికార్డయింది. మే 18 నుండి, ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా 44 డిగ్రీల కంటే పైనే నమోదవుతూ వచ్చాయి.

గత వారం రోజులుగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా చూసుకుంటే.. మే 18న 44.3 డిగ్రీలు, మే 19న 45.6 డిగ్రీలు, మే 20న 47.6 డిగ్రీలు, మే 21న 48.1 డిగ్రీలు, మే 22న 44.8 డిగ్రీలు, మే 23న 45.8 డిగ్రీలు, మే 24న 48.3 డిగ్రీలు, మే 25న 48.1 డిగ్రీలు, మే 26న 47.7 డిగ్రీలుగా ఉన్నాయి.
బుధవారం నాడు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా వడగాలులు లేదా తీవ్ర వడగాలుల పరిస్థితులు లేవు. శ్రీకాకుళం జిల్లాలో రెండు మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు, మరో 11 మండలాల్లో సాధారణ వడగాలుల పరిస్థితులు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు, మరో రెండు మండలాల్లో సాధారణ వడగాలుల పరిస్థితులు ఉన్నాయి.
ఇక గురువారం(మే 28) నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 100కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించాయి. శుక్రవారం నాడు కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. ఐఎమ్డి ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. గురువారం, శుక్రవారాల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో బలమైన గాలులతో, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బీహార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి, అలాగే ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఎగువ వాయు తుఫాను ప్రసరణ కారణంగా వాతావరణం ప్రభావితం అవుతుంది. తూర్పు-మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఎగువ వాయు తుఫాను ప్రసరణ కొనసాగుతోంది.
{{/usCountry}}ఇదిలా ఉండగా.. గురువారం, శుక్రవారాల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో బలమైన గాలులతో, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బీహార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి, అలాగే ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఎగువ వాయు తుఫాను ప్రసరణ కారణంగా వాతావరణం ప్రభావితం అవుతుంది. తూర్పు-మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఎగువ వాయు తుఫాను ప్రసరణ కొనసాగుతోంది.
{{/usCountry}}