రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం…

రాజమహేంద్రవరంలోని ఒక షాపింగ్ మాల్ బయట గురువారం రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పీజీ మెడికల్ విద్యార్థులైన ప్రియాంక, ఉమేష్ ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్పై వెళ్తుండగా, మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఒక కారు వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రమైన గాయం కాగా…. ఉమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకను స్థానిక రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం, తదుపరి నిర్వహణ కోసం ఆగస్టు 6న హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అత్యంత విషాదం - సీఎం చంద్రబాబు
ఈ విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా స్పందించారు. "వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం నన్ను ఎంతగానో కలచివేసింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ యువకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, ఎంతో ఆశాజనకమైన భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి చేతనైన అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదానికి కారణమైన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించారని సీఎం వెల్లడించారు. తాగుబోతుల నిర్లక్ష్యానికి అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని, ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారికి తగిన కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ ప్రమాదానికి కారణమైన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించారని సీఎం వెల్లడించారు. తాగుబోతుల నిర్లక్ష్యానికి అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని, ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారికి తగిన కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.
{{/usCountry}}