ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు మీద వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు బలహీనపడిందని ఆరోపించారు. ఈ మందగమనం గ్రామీణ కార్మికులకు ఉపాధి, వేతనాలను తగ్గించిందని ఆయన అన్నారు.

'ఈ పథకం గ్రామీణ కుటుంబాల వద్ద ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచి, వినియోగాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో ఒకటిగా ఉండేది. కానీ ఇటీవలి పోకడలు మందగమనాన్ని సూచిస్తున్నాయి.' అని జగన్ అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దృక్కోణం నుండి, MGNREGA సమర్థవంతమైన అమలు అత్యంత కీలకమని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ వర్గాలలో ఆదాయాలను పెంచుతుందన్నారు వైఎస్ జగన్.
ఎంజీఎన్ఆర్ఈజీఏ గణాంకాలను పోస్ట్ చేసిన జగన్.. గత రెండేళ్లలో ఆమోదిత బడ్జెట్, సృష్టించిన పనిదినాలు, 100 రోజుల పనిని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య, మొత్తం వ్యయం అన్నీ తగ్గాయని అన్నారు. ఈ తగ్గుదల, తక్కువ ఉపాధి అవకాశాలను, గ్రామీణ కార్మికులకు తక్కువ వేతనాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి మందగించడం కొనుగోలు శక్తి క్షీణించడాన్ని, డిమాండ్ బలహీనపడటాన్ని సూచిస్తోందని జగన్ అన్నారు. ప్రభుత్వం అవినీతితో సతమతమవుతూ ప్రజా సమస్యలపై దృష్టి కోల్పోయిందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలను నిరంతరం నిర్లక్ష్యం చేయడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపుతుందని జగన్ పేర్కొన్నారు.
నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అని వైఎస్ జగన్ అన్నారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇలాంటి చార్రిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం వెనకపడిపోయిందన్నారు.
{{/usCountry}}నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అని వైఎస్ జగన్ అన్నారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇలాంటి చార్రిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం వెనకపడిపోయిందన్నారు.
{{/usCountry}}'ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే అర్థం అవుతుంది. రెండు సంవత్సరాలలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తక్కువైపోయింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు.' అని వైఎస్ జగన్ అన్నారు.