Visakhapatnam Earthquake : విశాఖలో స్వల్ప భూప్రకంపనలు - పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
Visakhapatnam Earthquake : విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. బంగాళాఖాతంలో కాకినాడ తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు ధృవీకరించారు.
Visakhapatnam Earthquake : విశాఖపట్నం నగర ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం సుమారు 5:08 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న పలువురు స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడంతో కంగారుగా రోడ్లపైకి పరుగులు తీశారు. తీరప్రాంత పరిసరాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కాస్త స్పష్టంగా కనిపించింది.
బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
ఈ ప్రకంపనలకు సంబంధించి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్ర గర్భంలో వచ్చిన మార్పుల వల్లే తీరప్రాంత జిల్లాల్లో ఈ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఆందోళన అవసరం లేదు: అధికారులు
భూప్రకంపనల వార్తతో తీరప్రాంత జనాలు ఆందోళన చెందినప్పటికీ, అధికారులు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. బంగాళాఖాతం లోపల భూకంపం వచ్చినప్పటికీ దీని వల్ల ఎలాంటి ప్రమాదం గానీ, ఆస్తి, ప్రాణ నష్టం గానీ వాటిల్లలేదని స్పష్టం చేశారు. సునామీ లాంటి ముప్పులు వచ్చే అవకాశం లేదని ప్రాథమిక అంచనాలో తేలింది. అయినప్పటికీ తీరప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని… తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

