విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. వివాహితుడైన ఓ నేవీ ఉద్యోగి… మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాల తలెత్తాయి. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు మౌనిక(28)ను ఇంటికి పిలిచి… అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచాడు.
వివాహేతర సంబంధం…
ప్రాథమిక వివరాల ప్రకారం…. ఇండియన్ నేవీలో రవీంద్ర అనే వ్యక్తి ఎయిర్ క్రాప్ట్ టెక్నిషీయన్గా పనిచేస్తున్నాడు. గాజువాక పరిధిలోని ఎల్వీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రవీంద్రకు పెళ్ళై భార్య ఉండగా…. కైలాసపురం ప్రాంతానికి చెందిన మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
కొన్ని రోజుల కిందట రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అర్ధరాత్రి దాటిన తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కోపోద్రిక్తుడైన రవీంద్ర…. ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి… సగ భాగాన్ని ఫ్రిజ్లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు.
అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా… తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించినట్టు సమాచారం. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలికి సంబంధించిన వివరాలు, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతుండగా…. కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.