Covid Cases in Andhrapradesh : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన ‘RF.5’ రకం బారిన పడిన నలుగురు బాధితులను గుర్తించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
కడప జిల్లాకు చెందిన నలుగురు కొవిడ్ బాధితుల శాంపిళ్లను పూణేలోని జాతీయ వైరాలజీ లాబొరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా…. ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని అంచనా వేశారు.
భయపడాల్సిన పనిలేదు….
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. రెగ్యులర్ జీనోమ్ సర్వైలెన్స్లో భాగంగానే ఈ RF.5 వేరియంట్ను గుర్తించామన్నారు. సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీనిపై నిఘా ఉంచిందని తెలిపారు. అయితే… ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఈ RF.5 వేరియంట్ ఇతర ఒమిక్రాన్ రకాల కంటే ప్రమాదకరమైనదనే సూచనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేవలం అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు.
లక్షణాలు ఇలా…
ఈ కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణ ఒమిక్రాన్ లాగే గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులుగా ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా… రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు చాలా తక్కువగా (స్పోరాడిక్) ఉన్నాయని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ భరోసా ఇచ్చారు.
బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడంతో పాటు, టెస్టింగ్ కిట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం… జూలై 16 వరకు నమోదైన 12 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
{{/usCountry}}బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడంతో పాటు, టెస్టింగ్ కిట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం… జూలై 16 వరకు నమోదైన 12 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
{{/usCountry}}