ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రాకపోకలు సాగించనుంది. పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను బుధవారం ప్రారంభించారు.ఈ అమృత్ భారత్ ట్రైన్ సర్వీస్….. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తోంది.

పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టైమింగ్స్, హాల్డింగ్ స్టేషన్ల వివరాలను రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్బాద్ (ట్రైన్ 16619) శనివారం ఉదయం 6.15 గంటలకు బయల్దేరుతుంది. 06:30 నిమిషాలకు కోయంబత్తూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 15:05 నిమిషాలకు ఏపీలోని రేణిగుంట స్టేషన్ కు చేరుకుంటుంది.అంతేకాకుండా నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, ఝార్సుగూడ మీదుగా ధన్ బాద్ చేరుకుంటుంది. ఇక ధన్ బాద్ - పోదనూర్ (ట్రైన్ నెంబర్ 16620) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ బుధవారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 1 పాంట్రీ కార్ (ఆహార సదుపాయం), సెకండ్ క్లాస్ కోచ్లు (దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి) ఉంటాయి.
హాల్టింగ్ స్టేషన్లు:
కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట, కాట్పాడి, తిరుత్తణి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయఘడ్, మునిగుడ, రాంఛీ, మురి, బోకారో స్టీల్ సిటీ, చంద్రాపుర స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ ట్రైన్ స్టాపేజీ టైమింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
{{/usCountry}}కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట, కాట్పాడి, తిరుత్తణి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయఘడ్, మునిగుడ, రాంఛీ, మురి, బోకారో స్టీల్ సిటీ, చంద్రాపుర స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ ట్రైన్ స్టాపేజీ టైమింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
{{/usCountry}}సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ అమృత్ భారత్ ట్రైన్ ద్వారా పొందొచ్చు.