రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. తొలుత నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. నవంబర్ 21వ తేదీన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముర్ము పూజలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది.
శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 21వ తేదీన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారని వివరించింది.
ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముర్ము… ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.0
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు. పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.