...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి రైళ్ల సమయాల్లో మార్పులు, కొత్త టైమ్ టేబుల్!

జనవరి 1 నుండి కొత్త రైలు టైమ్‌టేబుల్‌ను ప్రవేశపెట్టడంతో ప్రయాణికులు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలను ఆస్వాదించవచ్చు. ప్రయాణికులు రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలి.

Published on: Dec 28, 2025, 18:36:43 IST
Advertisement

జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణం ప్రారంభమయ్యే ముందు రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాలలో మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in) లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్(ఎన్‌టీఈఎస్) ద్వారా పొందవచ్చని తెలిపింది. సికింద్రాబాద్ లేదా కాచిగూడలో ప్రారంభమయ్యే లేదా ముగిసే 25 రైళ్లలో ఎనిమిది రైళ్ల సమయాలు ఎస్‌సీఆర్ పరిధిలోని ప్రారంభ స్టేషన్లలో స్వల్పంగా మార్చుతున్నట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటనలో పేర్కొంది. 5 నుంచి 30 నిమిషాల వ్యత్యా‌సం ఉండనుంది. అందుకే జనవరి 1 నుంచి రైలు ప్రయాణం చేసేవారు.. రైల్వే స్టేషన్‌కు ముందుగా రావడం మంచిది.

రైల్వే టైమింగ్స్ మార్పులు
రైల్వే టైమింగ్స్ మార్పులు

ఇక దేశంలో అప్డేట్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ప్రయాణికులకు అనుకూలమైన అనేక మార్పులను తీసుకువస్తుందని భారతీయ రైల్వే పేర్కొంది. కొత్త టైమ్‌టేబుల్‌లో వివిధ స్టేషన్లలో 61 రైళ్లకు కొత్త స్టాప్‌లు వస్తాయి. దీనివల్ల ప్రయాణికులు, నివాసితులకు రైలు ప్రయాణం మరింత అందుబాటులో ఉంటుంది.

రైల్వేలు ప్రధాన మౌలిక సదుపాయాల అప్డేట్ అవుతున్నాయి, వీటిలో ట్రాక్ డబ్లింగ్, ఇంటర్‌లాకింగ్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్, విద్యుదీకరణ ఉన్నాయి. ఇవి రైలు వేగంలో గణనీయమైన పెరుగుదలను, తక్కువ ప్రయాణ సమయాన్ని తెస్తాయి. ఇటువంటి మెరుగుదలల ఫలితంగా వేగవంతమైన, మరింత సమర్థవంతమైన సేవలను ప్రతిబింబించేలా రైలు టైమ్‌టేబుల్ అప్డేట్ అవుతుంది.

'రైలు కార్యకలాపాల కోసం కొత్త టైమ్‌టేబుల్ జనవరి 1న విడుదల అవుతుంది. ఇందులో కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు, ఫ్రీక్వెన్సీ పెరుగుదల, రైలు నంబర్లలో మార్పులు, కొత్త స్టాప్‌లు, వివిధ స్టేషన్లలో రాకపోకల సమయాల్లో మార్పులు ఉన్నాయి. కొత్త టైమ్‌టేబుల్ ముఖ్య లక్షణం వివిధ స్టేషన్లలో 61 రైళ్లకు కొత్త స్టాప్‌లను ప్రవేశపెట్టడం.' అని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

కొత్త టైమ్‌టేబుల్‌లో 12 జతల కొత్త రైళ్లు, నాలుగు జతల రైళ్ల పొడిగింపు, రెండు జతల రైళ్ల టెర్మినల్ స్టేషన్లలో మార్పు, రెండు జతల రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుదల, 12 రైళ్ల రైలు నంబర్లలో మార్పులు, 164 రైళ్లకు కొత్త స్టాప్‌లు ఉన్నాయి. వీటిలో 61 రైళ్లకు జనవరి 1 నుండి కొత్త స్టాప్‌లు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe