ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) శుభవార్తను అందించింది. నరసాపురం నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లను (Train on Demand - TOD) శాశ్వత రైళ్లుగా (రెగ్యులరైజ్) మారుస్తూ రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2026 జూలై మొదటి వారం నుంచి అమలులోకి రానుంది. ప్రయాణికుల రద్దీ, నిరంతర డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఈ అడుగు వేసింది.
నరసాపురం – తిరువణ్ణామలై – నరసాపురం :

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తుల కోసం ఈ రైలును రెగ్యులరైజ్ చేశారు. 2026 జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయి.
- నరసాపురం – తిరువణ్ణామలై ఎక్స్ప్రెస్(ట్రెయిన్ నంబర్ 17291 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 13:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు (గురువారం) తెల్లవారుజామున 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై – నరసాపురం ఎక్స్ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 17292 ) ప్రతి గురువారం ఉదయం 11:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 02:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాంట్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
నరసాపురం – బెంగళూరు – నరసాపురం :
- ఐటీ నగరం బెంగళూరు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారుల కోసం ఈ రైలు సర్వీసును శాశ్వతం చేశారు. 2026 జూలై 3వ తేదీ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది.
- నరసాపురం – SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్(ట్రెయిన్ నంబర్ 17293 ) ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 15:50 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు (శనివారం) ఉదయం 09:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో ట్రెయిన్ నంబర్ 17294 SMVT బెంగళూరు – నరసాపురం ఎక్స్ప్రెస్ ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) తెల్లవారుజామున 06:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఈ సర్వీసు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లు శాశ్వతం కావడం వల్ల భక్తులకు, ఐటీ ఉద్యోగులకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడం మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}ఈ సర్వీసు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లు శాశ్వతం కావడం వల్ల భక్తులకు, ఐటీ ఉద్యోగులకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడం మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}