రైల్వేల్లో 3,993 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. RRB JE నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 3,993 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, దరఖాస్తు గడువు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 14, 2026, 16:02:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,993 జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrb.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వేల్లో 3,993 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. RRB JE నోటిఫికేషన్ విడుదల
రైల్వేల్లో 3,993 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. RRB JE నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమై, సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15 వరకు సమయం ఇచ్చారు. సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి (Correction Window) సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25 వరకు అవకాశాన్ని కల్పించారు.

అర్హతలు, వయోపరిమితి

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు ఫీజు, రీఫండ్ వివరాలు

సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500గా నిర్ణయించారు. మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)కు హాజరైన అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి 400 వారి ఖాతాల్లోకి రీఫండ్ చేస్తారు.

SC, ST, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250గా నిశ్చయించారు. CBT-1 పరీక్ష రాసిన తర్వాత ఈ రుసుమును కూడా అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు. ఫీజు చెల్లింపులను కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు లేదా UPI ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లోనే స్వీకరిస్తారు.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది.

  • మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I)
  • రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-II)
  • ధ్రువపత్రాల పరిశీలన (Document Verification)

వైద్య పరీక్షలు (Medical Examination)

మొదటి దశ సీబీటీ పరీక్ష కేవలం అర్హత (స్క్రీనింగ్) పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన నార్మలైజ్డ్ మార్కుల ప్రాతిపదికన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను రెండో దశ (CBT-II) పరీక్షకు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించవచ్చు.

సమగ్ర నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More