విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదే సాయికృష్ణ కస్టోడియస్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న రియల్టర్ గులివిందల సురేష్ను న్యాయస్థానంలో హాజరుపరిచిన సిట్.. శుక్రవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పోలీసుల అమానుష చర్యలు, ఆధారాల విధ్వంసం, మృతదేహం దహనం వరకు జరిగిన వరుస పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించింది.

మే 7న కృష్ణలంక సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నానిలు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారని, ఆ సమయంలో రియల్టర్ సురేష్ అక్కడే ఉన్నాడని సిట్ పేర్కొంది. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను రాణిగారితోటలోని ఒక నిర్మానుష్య భవనానికి తరలించారు.
మే 12న సురేష్ ఆ భవనానికి వెళ్లగా సాయికృష్ణ తీవ్ర గాయాలతో ఉన్నాడు. అతను కోలుకునే వరకు అక్కడే ఉంచాలని సీఐ నాగరాజు సూచించారు. సరైన వైద్యం అందక సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.
మే 12, 13 మధ్యరాత్రి సీఐ నాగరాజు, అశోక్, సురేష్ కలిసి సాయికృష్ణ మృతదేహాన్ని ఒక బొంతలో చుట్టి, ద్విచక్రవాహనంపై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా దహనం చేశారు. మే 18న మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా మిగిలి ఉన్నాయా అని చూడటానికి సురేష్ మళ్లీ శ్మశానవాటికకు వెళ్లాడు.
కేసునుంచి తప్పించుకోవడానికి సాంకేతిక ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఫోన్ నుండి డిలీట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. సిట్ అధికారులు శ్మశానవాటిక నుండి బూడిద, ఎముకల అవశేషాలు, కాలిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు.
సాయికృష్ణ మేనమామ ముల్లాపూడి నవరంగ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని ఉపసంహరించుకోవాలని మే 31న కృష్ణలంక పోలీసులతో కలిసి సురేష్ ఆయన ఇంటికి వెళ్లాడు. కేసు ఉపసంహరణకు భారీగా పరిహారం ఆఫర్ చేయగా, నవరంగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
{{/usCountry}}సాయికృష్ణ మేనమామ ముల్లాపూడి నవరంగ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని ఉపసంహరించుకోవాలని మే 31న కృష్ణలంక పోలీసులతో కలిసి సురేష్ ఆయన ఇంటికి వెళ్లాడు. కేసు ఉపసంహరణకు భారీగా పరిహారం ఆఫర్ చేయగా, నవరంగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
{{/usCountry}}ఈ దారుణ ఉదంతంపై మరింత లోతైన విచారణ జరిపేందుకు నిందితుడు సురేష్ను 15 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ విధించడంతో, అతడిని నూజివీడు జైలుకు తరలించారు.
సాయికృష్ణ ఆకస్మిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు మొదటి నుంచీ కృష్ణలంక పోలీసులపైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలోనే తీవ్ర హింసకు గురై మరణించాడని, ఆపై మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చివేశారని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించడంతో ఒక్కొక్కరి పాత్ర బయటకు వస్తోంది.