Tirupati Akola Weekly Express : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ…. వాటిని శాశ్వత వీక్లీ ఎక్స్ప్రెస్లుగా మార్చింది. ఇందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మే మొదటి వారం నుంచి రైలు నంబర్లు 17429/17430 కొత్త టైమ్ టేబుల్తో అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త రైలు కేవలం రెండు నగరాలను కలపడమే కాకుండా…. రాయలసీమ, తెలంగాణలోని ప్రధాన పట్టణాలను మహారాష్ట్రలోని కీలక కేంద్రాలతో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ రైలు పెద్ద ఊరటనివ్వనుంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, నిజామాబాద్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
కొత్త సర్వీసుల వివరాలు ఇవే….
అకోలా నుంచి తిరుపతికి వచ్చే రైలు (ట్రైన్ నంబర్ 17430) మే 3వ తేదీ నుంచి తన సేవలను ప్రారంభించనుంది. ఇది ప్రతి ఆదివారం ఉదయం 08:10 గంటలకు అకోలాలో బయలుదేరి….. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 08:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి నుంచి అకోలా వెళ్లే రైలు (నంబర్ 17429) మే 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:25 గంటలకు తిరుపతిలో బయలుదేరి…. శనివారం మధ్యాహ్నం 14:00 గంటలకు అకోలా చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు ఇవే….
ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు….. పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్ , కర్నూల్ సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్ తో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైలులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (SL), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు. గతంలో 07605/07606 నంబర్లతో నడిచిన ఈ స్పెషల్ ట్రైన్లను ఇప్పుడు పర్మనెంట్ వీక్లీ ఎక్స్ప్రెస్లుగా మార్చడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}ఈ రైలులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (SL), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు. గతంలో 07605/07606 నంబర్లతో నడిచిన ఈ స్పెషల్ ట్రైన్లను ఇప్పుడు పర్మనెంట్ వీక్లీ ఎక్స్ప్రెస్లుగా మార్చడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}