ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - అకోలా - తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుకు మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది. ఈ రైల్వే స్టేషన్ అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం మార్చి 6 తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్న వివరాల ప్రకారం….. తిరుపతి అకోలా ఎక్స్ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి అకోలా ఎక్స్ప్రెస్ రైల్ ( ట్రైన్ నెంబర్ 07605) తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది.
తాజా నిర్ణయం ప్రకారం.... ఈ ట్రైన్ తెల్లవారుజామున 2 గంటల 49 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగుతుంది. అనంతరం 2.50 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.
ఇక అకోలా -తిరుపతి మధ్య నడిచే(ట్రైన్ నెంబ్ 07606) ట్రైన్ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2.34 నిమిషాలకు మొలకలచెరువు రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగి... మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.
ఈ ట్రైన్ ఏపీలోని ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ తో పాటు తెలంగాణలోని గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి తర్వాత కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
తదుపరి నిర్ణయాన్ని ప్రకటించేవరకూ తిరుపతి - అకోలా ఎక్స్ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.
{{/usCountry}}తదుపరి నిర్ణయాన్ని ప్రకటించేవరకూ తిరుపతి - అకోలా ఎక్స్ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.
{{/usCountry}}