Summer Special Trains : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి జంక్షన్ మధ్య నడుస్తున్న వేసవి ప్రత్యేక రైళ్ల (సమ్మర్ స్పెషల్) సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా ఈ రైళ్లలో ఏసీ. స్లీపర్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు.

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…
- రైలు సంఖ్య 06077 (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ → సంత్రాగచ్చి జంక్షన్) : ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం చెన్నై నుంచి బయలుదేరుతుంది. జూన్ 20వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. మొత్తం 3 ట్రిప్పుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.
- రైలు సంఖ్య 06078 (సంత్రాగచ్చి జంక్షన్ → ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) : ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం సంత్రాగచ్చి నుంచి బయలుదేరుతుంది. జూన్ 22వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మొత్తం 3 ట్రిప్పుల పాటు నడుస్తుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ ప్రత్యేక రైళ్లలో అధునాతన కోచ్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఒక ఏసీ 2-టైర్ (AC 2-Tier) బోగీ, మూడు ఏసీ 3-టైర్ (AC 3-Tier) బోగీలతో పాటు అత్యధికంగా పదిహేడు స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్లను కేటాయించారు.
ఏపీలో ఆగే స్టేషన్లు…
ఈ రైళ్లు… ఏపీలోని పలు స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, సామల్ కోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒడిశా పరిధిలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ స్టేషన్లలో ఆగిన తర్వాత…. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మీదుగా సంత్రాగచ్చి జంక్షన్కు చేరుకుంటాయి
{{/usCountry}}ఈ రైళ్లు… ఏపీలోని పలు స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, సామల్ కోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒడిశా పరిధిలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ స్టేషన్లలో ఆగిన తర్వాత…. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మీదుగా సంత్రాగచ్చి జంక్షన్కు చేరుకుంటాయి
{{/usCountry}}వేసవి సెలవుల్లో సొంతూళ్లకు మరియు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ పొడిగించిన రైల్వే సేవలను ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.