Swaasa AI TB screening : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ…. కేవలం స్మార్ట్ఫోన్ ద్వారా క్షయ (TB) వ్యాధిని గుర్తించే వినూత్న ప్రయోగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్కు చెందిన 'సాల్సిట్ టెక్నాలజీస్' అనే స్టార్టప్ రూపొందించిన 'శ్వాస' (Swaasa) అనే ఏఐ యాప్ ద్వారా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ సాగింది.

సాధారణంగా టీబీ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులను గుర్తించాలంటే ఎక్స్రే, కళ్లె పరీక్షలు తప్పనిసరి. అయితే మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద పైలట్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్ సి) లో స్వాసా తన ఏఐ-ఆధారిత శ్వాసకోశ స్క్రీనింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా ఏఎన్ఎంలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, బాధితుల దగ్గు శబ్దాన్ని స్మార్ట్ఫోన్ యాప్లో రికార్డ్ చేశారు. ఈ శబ్దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషించి…. ఆ వ్యక్తికి టీబీ, ఆస్తమా లేదా సిఓపిడి వంటి వ్యాధులు ఉన్నాయా లేవా అన్నది నిమిషాల్లోనే తెలియజేస్తుంది. ఒకవేళ ఏఐ సాఫ్ట్వేర్ రిస్క్ ఉందని సూచిస్తే….. వెంటనే వారికి ఎక్స్రే లేదా నాట్ పరీక్షల కోసం ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్….
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఏపీ ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కేవలం ఆరు వారాల్లోనే సుమారు 8,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టీబీ లక్షణాలు బయటపడని (Asymptomatic) వారిలో కూడా సుమారు 36 శాతం మందికి ఈ యాప్ ద్వారా వ్యాధిని గుర్తించడం సాధ్యమైంది. సాధారణ పరీక్షల కంటే ఈ ఏఐ టెక్నాలజీ వల్ల టీబీ గుర్తింపు రేటు 15 శాతం పెరిగిందని సాల్సిట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు నారాయణరావు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాలకు వరం
రోజువారీ కూలీలు, వృద్ధులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునే వీలు లేని వారికి…. ఇంటి వద్దే నిమిషాల్లో ప్రాథమిక స్క్రీనింగ్ పూర్తివుతోంది. ఈ విధానంలో రేడియేషన్ భయం ఉండదు, ఎటువంటి ఖరీదైన పరికరాల అవసరం లేదు. ఇది 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' (ABDM) తో కూడా అనుసంధానించబడింది, తద్వారా రోగుల డేటా మరియు చికిత్స వివరాలను జాతీయ స్థాయిలో పర్యవేక్షించడం సులభమవుతుంది.
{{/usCountry}}రోజువారీ కూలీలు, వృద్ధులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునే వీలు లేని వారికి…. ఇంటి వద్దే నిమిషాల్లో ప్రాథమిక స్క్రీనింగ్ పూర్తివుతోంది. ఈ విధానంలో రేడియేషన్ భయం ఉండదు, ఎటువంటి ఖరీదైన పరికరాల అవసరం లేదు. ఇది 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' (ABDM) తో కూడా అనుసంధానించబడింది, తద్వారా రోగుల డేటా మరియు చికిత్స వివరాలను జాతీయ స్థాయిలో పర్యవేక్షించడం సులభమవుతుంది.
{{/usCountry}}ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఈ ఏఐ ఆధారిత స్క్రీనింగ్ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంది.