ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే...

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అనకాపల్లి - చర్లపల్లి మధ్య వీటిని నడపనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

Published on: Jan 14, 2026 9:32 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండగ వేళ ప్రయాణి రద్దు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా అనకాపల్లి - చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది.ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు
  • దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…..అనకాపల్లి - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07479) మధ్య 2 ప్రత్యేక జనవరి 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ ప్రత్యేక రైళ్లు అనకాపల్లి నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతాయి. మరునాడు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటాయి.
  • ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.
  • చర్లపల్లి - అనకాపల్లి (ట్రైన్ 07477) మధ్య మరో సర్వీస్ ఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ జనవరి 19వ తేదీన చర్లపల్లి నుంచి అర్ధరాత్రి 12.40 గంటలకు బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.
  • ఈ స్పెషల్ ట్రైన్ ఎలమంచిలి, తుణి, అన్నవరం, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, అకినీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగుడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.

మరోవైపు హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడవనున్నాయి. హైదరాబాద్ - విజయవాడ మధ్య జనవరి 18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి.

ఇక విజయవాడ - హైదరాబాద్ మధ్య జనవరి 17,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.40 నిమిషాలకు బయల్దేరి.. రాత్రి 10.35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటాయి.

హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్ పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.