సంక్రాంతికి పల్లెకు పట్నం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ
సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారులన్నీ రద్దీగా ఉన్నాయి. ఇక హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రోజున కూడా రద్దీ కొనసాగుతోంది.
హైదరాబాద్-విజయవాడ హైవేలో వరుసగా మూడో రోజు సోమవారం కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి అనేక మంది ఆంధ్రప్రదేశ్లోని తమ ఊర్లకు వెళుతున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అధికారులు 10 టోల్ బూత్లను తెరిచారు.

పెదకపర్తి, చిట్యాల, కోదాడ, రామపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పండుగ రద్దీని తగ్గించడానికి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న ప్రదేశాలలో పోలీసు అధికారులు అదనపు సిబ్బందిని మోహరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పండుగ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో శనివారం నుండి చాలా కుటుంబాలు తమ స్వస్థలాలకు వెళ్లడం మెుదలుపెట్టాయి.
సంక్రాంతికి ఆంధ్రాకు ఊర్లకు వెళ్తుండటంతో రహదారులపై ట్రాఫిక్ భారీగా ఉంది. టోల్ ప్లాజాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. 24 గంటల ప్రత్యేక సేవలు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇక విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో తెల్లవారుజాము నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు.
ముఖ్యంగా కృష్ణ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపే మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి మొత్తం 8,432 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. మొత్తం 6,000 బస్సు సర్వీసులు ఆంధ్రప్రదేశ్లోని డిమాండ్ను తీర్చడానికి పరిమితం చేశారు. అయితే 2,432 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానించేందుకు ఏర్పాటు అయ్యాయి.
ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రత్యేకంగా నడుస్తున్నప్పటికీ.. రద్దీ రోజులలో డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీని వలన చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ రవాణాను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. విజయవాడ బస్ స్టేషన్ నుండి ప్రతిరోజూ 200 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో ప్రధానంగా హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా ఉంటాయి.
మరోవైపు టోల్ ప్లాజాల వద్ద భారీ వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. కీసర టోల్ ప్లాజా సిబ్బంది ప్రకారం, శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 55,000 వాహనాలు దానిని దాటాయి. ఫలితంగా పొడవైన క్యూలు, నెమ్మదిగా కదిలే ట్రాఫిక్తో ఇబ్బంది ఏర్పడింది. ఇదే కాలంలో తెలంగాణలోని పంతంగి టోల్ ప్లాజాను దాదాపు 1.30 లక్షల వాహనాలు దాటాయి. ఈ వాహనాల కదలికలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ వైపు, ముఖ్యంగా విజయవాడ వైపు ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


