South Central Railway Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి వన్-వే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచేలా నిర్ణయం తీసుకుంది.
ఈ పొడిగింపు నిర్ణయం ద్వారా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలగనుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
- నాందేడ్ – తిరుపతి వన్-వే స్పెషల్ (రైలు నంబర్: 07814) : హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి తిరుపతికి నడిచే ఈ వన్-వే ప్రత్యేక రైలు (Train No. 07814) గురువారం( 21 మే 2026) కూడా సర్వీసును అందిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
- తిరుపతి – జాల్నా వన్-వే స్పెషల్ (రైలు నంబర్: 07815) : తిరుపతి నుంచి జాల్నాకు నడిచే తిరుగు ప్రయాణ వన్-వే ప్రత్యేక రైలు (Train No. 07815) శుక్రవారం (22 మే 2026) నాడు కూడా నడుస్తుంది. ఈ రెండు రైళ్లకు సంబంధించి ప్రస్తుతానికి ఒక్కొక్క సర్వీసును మాత్రమే పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్, స్టాపింగులు, సమయాల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఐఆర్సీటీసీ (IRCTC) యాప్ ద్వారా ప్రయాణికులు సరిచూసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను పొడిగించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.