ఏపీలోని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - వెంటనే అప్డేట్ చేసుకోండి..!

రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 నుంచి 30 వరకు ఈ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.

Published on: Oct 15, 2025, 10:24:28 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.

ఏపీ స్కూళ్లలో ఆధార్ క్యాంపులు
ఏపీ స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 30వ తేదీ వరకు ఈ క్యాంపుల ద్వారా సేవలను పొందవచ్చు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు వారి కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. వీరి సంఖ్య 8 లక్షలకుపైగానే ఉంది. ఇక 15 ఏళ్ల పైబడిన వారు మరో 7 లక్షల మందికిపైగా ఉంటారని లెక్కలు చెబుతచున్నాయి. కాబట్టి వీరంతా వారి పాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

  • చిన్నారుల‌కు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా ద‌ర‌ఖాస్తు ఫారం ఉండాలి.
  • పిల్లలను త‌ల్లి లేదా తండ్రి మాత్ర‌మే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.
  • చిన్నారులను ఆధార్ సెంట‌ర్‌కు తీసుకెళ్లే వారి (త‌ల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి.
  • ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి.
  • ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.

ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డును తీసుకుని ఉంటే.. వారికి 7 సంవత్సరాల వయస్సులోపు బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని, లేదంటే వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయవచ్చని యూఐడీఏఐ ఇటీవల ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు.

బాల్యంలో ఆధార్ తయారు చేసేటప్పుడు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అభివృద్ధి చెందదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More