ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే తాజాగా తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజూ సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో మాత్రమే, రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణా నష్టానికి ఇది ఉదాహరణ.
తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. అతివేగం వల్ల సంభవించే మరణాలలో రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ.
అన్ని రోడ్డు ప్రమాదాలలో 80 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలకు అతివేగం ఒక ప్రధాన ముప్పుగా మారిందని, దీనికి కారణం అతివేగం అని రోడ్డు భద్రతా నిపుణులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులే బాధితులు, అయితే హైవేలపై, నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు తరచుగా అధిక వేగంతో ఢీకొనే ప్రమాదాలలో ఉంటాయి.
చాలా ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్డు కర్వ్ ఉన్న ప్రాంతంలో, జంక్షన్లలో, సరైన సూచికలు లేని ప్రదేశాల్లో ప్రమాదాలు కనిపిస్తుంటాయి. స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, కనిపించే సంకేతాలను ఏర్పాటు చేయాలని పలువురు అధికారులను కోరుతూనే ఉన్నారు. స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, అవసరమైనది మెరుగైన రహదారి రూపకల్పన, సరైన గుర్తులు, స్థిరమైన సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}చాలా ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్డు కర్వ్ ఉన్న ప్రాంతంలో, జంక్షన్లలో, సరైన సూచికలు లేని ప్రదేశాల్లో ప్రమాదాలు కనిపిస్తుంటాయి. స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, కనిపించే సంకేతాలను ఏర్పాటు చేయాలని పలువురు అధికారులను కోరుతూనే ఉన్నారు. స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, అవసరమైనది మెరుగైన రహదారి రూపకల్పన, సరైన గుర్తులు, స్థిరమైన సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}ఇటీవలి కాలంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మరణాలు 1.48 లక్షల (2017) నుండి 1.68 లక్షల (2023)కు పెరిగాయి. ఇందులో దాదాపు 70 శాతం మరణాలు అతి వేగం వల్లే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి.