శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో 8 మంది మహిళలు, 12 సంవత్సరాల బాలుడు ఉన్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి వచ్చారు. రెయిలింగ్ ఊడి పడి ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది వరకు గాయపడ్డారు. స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో జనాలు క్యూ లైన్లో చిక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. సాయం కోసం ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో మెట్ల దగ్గర ఇరుక్కుపోయిన భక్తులు తొక్కిసలాట నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సంఘటన సమయంలో మహిళలు సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించారు.
గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు అంబులెన్స్లలో తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా వీడియోలో ఉన్నాయి.
తొక్కిసలాట తనకు బాధ కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
{{/usCountry}}తొక్కిసలాట తనకు బాధ కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
{{/usCountry}}సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 'శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద సంఘటనలోభక్తుల మరణం చాలా హృదయ విదారకం. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని నేను అధికారులను ఆదేశించాను.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
'కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనేక మంది భక్తుల మరణానికి కారణమైంది, ఇది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే నేను అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను. బాధిత వ్యక్తులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించాను.' అని మంత్రి నారా లోకేష్ అన్నారు.