ఐడీ కార్డ్ చూపిస్తే చాలు ఏపీఎల్ మ్యాచ్లకు స్టూడెంట్స్కు ఫ్రీ ఎంట్రీ.. ఈసారి 3 ప్రాంతాల్లో!
విద్యార్థులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గుడ్న్యూస్ చెప్పింది. స్కూల్, కాలేజీ ఐడీ కార్డులు చూపించి ఉచితంగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు చూడవచ్చు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'ఆంధ్రా ప్రీమియర్ లీగ్' (APL) కొత్త సీజన్కు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఏపీఎల్ సరికొత్త ఫార్మాట్తో, విస్తృత పరిధితో మన ముందుకు వస్తోంది. జూన్ 9వ తేదీ నుంచి ఈ లీగ్ మ్యాచ్లు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

ఈ టోర్నమెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు సంయుక్తంగా వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో లీగ్ నిర్వహణపై కీలక ప్రకటనలు చేశారు.
మూడు వేదికల్లో అట్టహాసంగా మ్యాచ్లు
గత సీజన్ పోటీలన్నీ కేవలం వైజాగ్ వేదికగానే జరిగాయి. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునేలా మూడు వేర్వేరు నగరాల్లో మ్యాచ్లను ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కవర్ చేస్తూ వేదికలను ఎంపిక చేయడం విశేషం.
మొదటి దశ (విశాఖపట్నం) : టోర్నీ ప్రారంభ మ్యాచ్తో పాటు తొలి విడత మ్యాచ్లన్నీ వైజాగ్లోనే జరగనున్నాయి.
రెండో దశ (కడప): లీగ్ తర్వాతి రౌండ్ మ్యాచ్లకు వైఎస్ఆర్ కడప జిల్లా వేదిక కానుంది.
చివరి దశ, ఫైనల్ (మంగళగిరి): టోర్నమెంట్ చివరి ఘట్టం, అత్యంత కీలకమైన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహిస్తారు.
విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ!
ఈ ప్రతిష్టాత్మక లీగ్లో మొత్తం 7 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మైదానాల్లో యువత, క్రీడాభిమానుల సందడిని పెంచేందుకు ఏసీఏ యాజమాన్యం ఒక సూపర్ ఆఫర్ను ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులందరికీ ఐడీ కార్డులు చూపిస్తే స్టేడియంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
ప్రమోషన్స్ కోసం ఫ్లాష్మాబ్లు
ఆంధ్రా ప్రీమియర్ లీగ్పై ప్రజల్లో మరింత ఆసక్తిని, అవగాహనను పెంచేందుకు మ్యాచ్లు జరిగే మూడు ప్రధాన నగరాల్లో (విశాఖ, కడప, మంగళగిరి) ప్రత్యేకంగా 'ఫ్లాష్మాబ్లు', ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ఆంధ్రా పరిధిలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ ఒక అద్భుతమైన వేదికగా మారింది. ఇక్కడ రాణించే ఆటగాళ్లకు నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడే అవకాశం లభిస్తుంది. మంగళగిరి, కడప వంటి ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నప్పటికీ.. పెద్ద మ్యాచులు తక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణ ద్వారా ఆయా స్టేడియాలు సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. స్థానిక క్రీడాకారులకు కూడా ఇదొక మంచి బూస్టింగ్ కానుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


