Tirumala Srivani Ticket Changes : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టుకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు నిబంధనలలో టీటీడీ పాలకమండలి కొన్ని కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు, స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే దాతలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ సరికొత్త విధానాన్ని రూపొందించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా, తిరుపతికి విమానాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ప్రతిరోజూ 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తున్నారు.
దాతల కోసం ప్రత్యేక కోటా
మిగిలిన 800 శ్రీవాణి దర్శన టికెట్లను ప్రతిరోజూ కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో కేటాయిస్తున్నారు. అయితే, ఈ 800 టికెట్లలో ఒక ముఖ్యమైన మార్పును టీటీడీ ప్రవేశపెట్టింది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్కు రూ.10 వేల విరాళం చెల్లించి, దర్శన టికెట్ కోసం వేచి చూస్తున్న దాతల కోసం ఈ కోటా నుంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా 300 టికెట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ సరికొత్త సదుపాయం గత సంవత్సరం (2025) మే 1వ తేదీ నుంచి విరాళాలు చెల్లించి…. అర్హులైన దాతలందరికీ వర్తించనుంది.
ఇవాళ్టి నుంచే అమలు.. దర్శన సమయాలు ఇవే!
ఈ నూతన విధానాన్ని ఇవాళ్టి (జూన్ 10) నుంచే టీటీడీ అమలులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక కోటా కింద కేటాయించిన 300 టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. విరాళం ఇచ్చిన దాతలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఈ నూతన విధానాన్ని ఇవాళ్టి (జూన్ 10) నుంచే టీటీడీ అమలులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక కోటా కింద కేటాయించిన 300 టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. విరాళం ఇచ్చిన దాతలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}అలా బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనుండటం ఇక్కడ విశేషం. ఒకవేళ నిర్ణీత మధ్యాహ్నం 1 గంట సమయానికి ఈ ప్రత్యేక కోటాలో టికెట్లు మిగిలిపోతే.. వాటిని తిరిగి సాధారణ కరెంట్ బుకింగ్ కోటాలోనే కలిపేస్తారు.
ఈ సరికొత్త మార్పుల విధానం రాబోయే 2027 మార్చి 31వ తేదీ వరకు నిరంతరాయంగా అమల్లో ఉంటుందని టీటీడీ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల విరాళాలు ఇచ్చిన దాతలకు వేచి ఉండే సమయం తగ్గి, అదే రోజు సాయంత్రానికే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది.