Tirumala : తిరుమలలో ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం, వరుణ జపం
సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను టీటీడీ నిర్వహించనుంది టీటీడీ. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఐదు రోజుల పాటు 'కారీరిష్టి యాగం', 'వరుణ జపం', అలాగే 'పర్జన్య శాంతి హోమం' వేడుకగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీటీడీ ఈ విషయాలను వెల్లడించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేదికగా ఈ ప్రత్యేక వైదిక క్రతువులు జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన 'మహా పూర్ణాహుతి' క్రతువును అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.
ఈ యాగంలో మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొని మంత్రోచ్ఛారణలతో హోమాలు జరుపుతారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో ఇప్పటికే వర్షాల కోసం యాగాలు నిర్వహించడం, టీటీడీ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడవడమే ఈ నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది. శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు వరుణ యాగం ఘనంగా జరిగింది. అలాగే విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆగస్టు 14 నుండి 16 వరకు వరుణ యాగం, వరుణ జపం, ఘటాభిషేకం వేడుకగా నిర్వహించారు.
తక్కువ వర్షపాతం నమోదైన సందర్భాల్లో టీటీడీ ఇలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014, 2015, 2017 సంవత్సరాల్లో కారీరిష్టి, పర్జన్య శాంతి, వరుణ యాగాలను ఆధ్యాత్మిక నిష్ఠతో నిర్వహించింది. 2023 సంవత్సరంలో కూడా ఆగస్టు 21 నుండి 26 వరకు ధర్మగిరిలో వరుణ యాగాన్ని చేపట్టింది. అదే ఏడాది సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు శ్రీనివాస మంగాపురంలో మూడు రోజుల పాటు 'శ్రీ శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహా శాంతి వరుణ యాగం' విజయవంతంగా నిర్వహించింది.
ఈ యాగాల ద్వారా వర్షభగవానుని కృప లభించి, సమస్త జీవకోటికి తాగునీరు, సాగునీరు సమృద్ధిగా అందుతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


