Srisailam Darshan : శ్రీశైలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - జూన్ 1 వరకు మార్పులు..!
Srisailam VIP Break Darshan Cancelled : వేసవి సెలవుల కారణంగా శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు.
Srisailam VIP Break Darshan Cancelled : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దివ్యధామంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ అసాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకుని…. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించేందుకు దేవస్థానం యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…
శుక్రవారం (మే 29) నుంచి జూన్ ఒకటో తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శన సౌకర్యం ఉంటుంది. మిగిలిన సమయంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దర్శనాలు కల్పించనున్నారు.
వేసవి సెలవుల కారణంగా వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా…. వారికి త్వరగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం ఈ కాలంలో మల్లికార్జునస్వామి వారి అలంకార దర్శనాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా దేవస్థానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

