Vizag Airport : విశాఖపట్నం నుంచి సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్.. రోజుకు 33 విమాన సర్వీసులు

Visakhapatnam Airport : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 33 విమాన సర్వీసులు నడుస్తాయి. వేసవి విమాన షెడ్యూల్‌లో భాగంగా ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published on: Mar 29, 2026 2:31 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 మార్చి 29 నుండి అక్టోబర్ 24 వరకు రోజుకు 33 విమాన సర్వీసులతో కూడిన వేసవి విమాన షెడ్యూల్‌ను అమలు చేయనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలపు షెడ్యూల్‌తో పోలిస్తే ఇది వ్యూహాత్మకంగా సామర్థ్యాన్ని పెంచింది. సుమారు 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచారు అధికారులు. ఈ 33 రోజువారీ విమాన సర్వీసులలో సుమారు 21 సర్వీసులతో ఇండిగో ఎక్కువ ఫ్లైట్లను నడుపుతుంది.

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు

ఈ కొత్త షెడ్యూల్‌లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. పశ్చిమాసియాకు ఒక కీలకమైన కనెక్షన్‌ను ప్రవేశపెట్టడం. ఇండిగో విమాన సర్వీసులు 6E1443, 6E1444.. విశాఖపట్నం, అబుదాబి మధ్య సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారాలలో 1-3-5-7 పద్ధతిలో నడుస్తాయి.

ఈ విమానాలు ఉదయం 08.20 గంటలకు చేరుకుని, 09.50 గంటలకు బయలుదేరుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తూ, స్కూట్ విమానాలు TR784, TR785, విశాఖపట్నాన్ని సింగపూర్‌తో వారానికి నాలుగు సార్లు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారాలలో నడుస్తాయి.

ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 2026 మార్చి 29 నుండి అక్టోబర్ 24 వరకు అమలులో ఉండే విశాఖపట్నం విమానాశ్రయం వేసవి విమాన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న మార్గాలు, కొత్త సీజనల్ సర్వీసులు సమతుల్యంగా ఉన్నాయి.

షెడ్యూల్ దేశీయ కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా వంటి కీలక మెట్రో నగరాలకు విశాఖపట్నం నుండి ప్రతిరోజూ పలు విమానాలు నడుస్తాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు ఈ మార్గాల్లో తమ సేవలను అందిస్తాయి.

ఏటీఆర్ విమానాలు విజయవాడ, తిరుపతి, భువనేశ్వర్ వంటి గమ్యస్థానాలకు సేవలు అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ కూడా బలోపేతం చేస్తాయి. ఇది ఈ ప్రాంతంలో ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతుంది.

అంతర్జాతీయంగా అబుదాబి, సింగపూర్‌లకు నేరుగా సర్వీసులు నడపడం ద్వారా విదేశీ ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉండనుంది. ఈ టైమ్‌టేబుల్‌లో సీజనల్ సర్దుబాట్లు కూడా ఉన్నాయి. కొన్ని సర్వీసులు నిర్దిష్ట కాలాల్లో మాత్రమే నడుస్తాయి. ఈ సీజన్‌లో మారుతున్న ప్రయాణ డిమాండ్‌ మేరకు.. కొన్ని విమాన సర్వీసులు ఏప్రిల్ మధ్య నాటికి ముగియనుండగా, మరికొన్ని ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More