Srisailam Dam Water Level : తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్ఫ్లో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం… మరోవైపు విద్యుదుత్పత్తితో పాటు వివిధ సాగునీటి అవసరాల కోసం దిగువకు నిరంతరం నీటిని తోడేస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతోంది.
ఇవాళ ఉదయం నమోదైన నీటిమట్టం వివరాలు
అధికారుల సమాచారం ప్రకారం ఇవాళ(ఆగస్ట్ 28, 2026) ఉదయం 8:45 గంటల సమయానికి శ్రీశైలం వద్ద నమోదైన ప్రధాన వివరాలు….
- ప్రస్తుత నీటిమట్టం: 873.701 అడుగులు
- నీటి నిల్వ: 157.507 టీఎంసీలు
- ఇన్ఫ్లో (వచ్చే నీరు) : 0
- ఔట్ఫ్లో (వెళ్తున్న నీరు): 48,765 క్యూసెక్కులు
జలాశయంలో నీటి నిల్వ తగ్గడానికి ప్రధాన కారణం ఔట్ఫ్లో ఎక్కువగా ఉండటమే. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం (SLBHES) ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తోంది. దీనికి తోడు శ్రీశైలం ఆధారిత వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నిరంతరం నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు ఇన్ఫ్లో దాదాపు శూన్యస్థాయికి చేరినా… దిగువకు 48,765 క్యూసెక్కుల చొప్పున నీటిని పంపడం వల్ల జలాశయం ఖాళీ అవుతోంది.
ఎగువన వర్షాలు తగ్గడమే కారణం
కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలానికి వచ్చే నీటి శాతం భారీగా పడిపోయింది. గురువారం నాడు కేవలం 3,483 క్యూసెక్కుల స్వల్ప ప్రవాహం మాత్రమే ప్రాజెక్ట్కు వచ్చి చేరింది. ఎగువ నుంచి కొత్తగా వరద నీరు వచ్చి చేరితే తప్ప శ్రీశైలంలో నీటిమట్టం తిరిగి పుంజుకునే అవకాశం లేదు.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 10,620 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 537.201(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 182.543(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది.
{{/usCountry}}మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 10,620 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 537.201(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 182.543(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది.
{{/usCountry}}ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి.