...
...
Next Story

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..!

గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భార్య.. తన భార్తను ప్రియుడితో కలిసి చంపేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు నానా ప్రయత్నాలు చేసి దొరికింది.

Published on: Jan 22, 2026, 06:16:55 IST
Advertisement

పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కనికరం లేకుండా చాలామంది చంపేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. విచారణలో విస్తూపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రియుడితో కలిసి భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో మాధురి కొన్ని రోజులు పనిచేసింది. ఇదే సమయంలో ఆమెకు గోపీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

మాధురితో సంబంధం కొనసాగిస్తున్న గోపీ హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహించేవాడు. ప్రియుడితో ఎక్కువ కలిసేందుకు భర్తను అతడి వద్దకే ఉద్యోగానికి పంపింది. కొన్నిరోజులకు వీరిద్దరి విషయం భర్త శివనాగరాజుకు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి తన భార్యను తీసుకుని చిలువూరుకు వచ్చేశాడు.

ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా గోపీతో మాధురి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు అయ్యాయి. నాగరాజుది ఉల్లిపాయాల వ్యాపారం కావడంతో ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేవాడు. దీంతో గోపీతో సంబంధానికి ఇబ్బందిగా ఫీల్ అయింది మాధురి. గొడవలు ఎక్కువ అయ్యాయి.

జనవరి 18వ తేదీన శివనాగరాజు చేసే భోజనంలో అధిక మెుత్తంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు భర్త. ఆ తర్వాత ప్రియుడు గోపీని పిలిపించింది. నిద్రపోతున్న నాగరాజు ముఖానికి దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ప్రియుడు గోపీ వెళ్లిపోయాడు. రాత్రి మెుత్తం మాధురి పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe