...
...
Next Story

గుంటూరు నుంచి చర్లపల్లికి వస్తున్న రైలులో దారుణం - కత్తితో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారం..!

ఏపీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం జరిగింది. కత్తితో బెదిరించిన దుండగుడు… హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని అత్యాచారానికి ఒడిగట్టాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Published on: Oct 15, 2025, 11:05:40 IST
Advertisement

గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైలులో దారుణం జరిగింది. 35 ఏళ్ల మహిళను కత్తితో బెదిరించిన ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఈనెల 13వ తేదీన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహిళపై అత్యాచారం (representative image)
మహిళపై అత్యాచారం (representative image)

ప్రాథమిక వివరాల ప్రకారం…. అక్టోబర్ 13న రాజమహేంద్రవరానికి చెందిన మహిళ చర్లపల్లికి వెళ్లేందుకు సంత్రగచి స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఎక్కింది. ఆమె లేడీస్ కోచ్ లో ఉన్నారు. కొన్ని స్టేషన్ల తర్వాత తర్వాత ప్రయాణికులు అందరూ ఖాళీ అయ్యారు. గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగగానే 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి కోచ్ వద్దకు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు.

అతని రాకను గమనించిన సదరు మహిళ.. లేడీస్ కోచ్ అని చెప్పే ప్రయత్నం చేసింది. తలుపు లాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ… అతను ఆ డోర్ ను తెరవమని బ్రతిమాలాడు. కోచ్ లోకి ప్రవేశించిన తర్వాత లోపలి నుంచి మూసివేశాడు. గుంటూరు, పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య రైలు వెళుతుండగా ఆ వ్యక్తి కత్తితో బెదిరించి… అత్యాచారం చేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

తప్పించుకున్న నిందితుడు…

నిందితుడు ఆమెను కొట్టి రూ.5,600 నగదు, మొబైల్ ఫోన్ ను దోచుకున్నాడు. రైలు పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ వద్దకు వస్తుండగా నిందితుడు దూకి తప్పించుకున్నాడు. చర్లపల్లికి చేరుకున్న బాధిత మహిళ… ఘటనపై ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు ఆధారంగా తదుపరి దర్యాప్తు కోసం ఈ సంఘటనకు సంబంధించి 'జీరో ఎఫ్ఐఆర్' (నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి) నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నడికుడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe