నకిలీ మద్యం వ్యవస్థీకృతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి మాఫియాను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. నకిలీ మద్యం తయారీ కోసం చిన్నపాటి పరిశ్రమలనే ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వంలోని వ్యక్తులే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని.. వాళ్లే బెల్టుషాపులు పెట్టి అమ్ముతున్నారని ఆరోపించారు. బెల్టుషాపులు కాకుండా ఇల్లీగల్ పర్మిట్రూమ్లు కూడా నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.
డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చిందన్నారు. ఒక్క మొలకలచెరువులోనే 20 వేలకు పైగా నకిటీ మద్యం బాటిళ్లు దొరికాయని గుర్తు చేశారు. మరో 8వేల బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారని చెప్పారు. 1,050 లీటర్ల స్పిరిట్ కూడా దొరికిందని… ఒకవేళ పట్టుబడకుంటే వేల లీటర్ల నకిలీ మద్యం తయారీ జరిగేదని అభిప్రాయపడ్డారు.
లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు..? జగన్
విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడిందని జగన్ చెప్పారు. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె. నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయని గుర్తు చేశారు. పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడన్న జగన్… ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేశ్కు మాత్రమే సాధ్యమని ధ్వజమెత్తారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలెన్నో అని అన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుకు తెలిసింది అది ఒక్కటే అని కామెంట్స్ చేశారు.
{{/usCountry}}విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడిందని జగన్ చెప్పారు. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె. నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయని గుర్తు చేశారు. పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడన్న జగన్… ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేశ్కు మాత్రమే సాధ్యమని ధ్వజమెత్తారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలెన్నో అని అన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుకు తెలిసింది అది ఒక్కటే అని కామెంట్స్ చేశారు.
{{/usCountry}}“డైవర్షన్లో భాగంగా ఎదుటివారిపై వాళ్లే బురదజల్లుతారు. నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డిది కీలకపాత్ర. నకిలీ లిక్కర్ బయటపడిన తర్వాత ఏ ఒక్క షాపులోనూ తనిఖీ చేయలేదు. జనార్దన్రావుపై లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మీ కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వస్తుంది…?” అని వైఎస్ జగన్ నిలదీశారు.
డైవర్షన్లో భాగంగానే జోగి రమేష్పై ఆరోపణలు చేశారని జగన్ చెప్పారు. జనార్దన్తో పరిచయం లేదని జోగి రమేష్ క్లియర్గా చెప్పారన్నారు. తన రెండు ఫోన్లు కూడా చూపించాడని… వీళ్లే ఫేక్ చాట్ను క్రియేట్ చేసి బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఎవిడెన్స్ను క్రియేట్ చేయడం దారుణమన్న జగన్… ఇటీవల లిక్కర్ స్కాం కేసులో రూ.11 కోట్లు సీజ్ చేసినట్లు హడావిడి చేశారని విమర్శనాస్త్రాలను సంధించారు.
2020లోనే అదానీ డేటా సెంటర్కు ఒప్పందం చేసుకున్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఆ తర్వాత అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తెచ్చేందుకు కూడా అంకురార్పణ చేశామని తెలిపారు. అదానీ, వైసీపీ, కేంద్రం కృషి లేకుంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చేది కాదని జగన్ వ్యాఖ్యానించారు. కానీ కూటమి పాలనలో రాష్ట్రాన్ని ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా పాలిస్తున్నారని… పెర్ఫార్మెన్స్లో చంద్రబాబు వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అని దుయ్యబట్టారు.