Allu Aravind: అల్లు అరవింద్ 'వన్ సైడ్ లవ్' స్టోరీలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఓయో రూమ్ కామెంట్స్ వైరల్!

Allu Aravind: 'దీవానా' (Deewana) మూవీ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మాతల గ్లామర్ సీక్రెట్ దగ్గరి నుంచి అల్లు అరవింద్ వన్ సైడ్ లవ్ స్టోరీస్, ఓయో రూమ్స్ వరకు సాగిపోయింది.

Published on: Jun 11, 2026, 14:26:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Aravind: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకే వేదికపై కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా 'దీవానా' మూవీ ప్రమోషన్స్ కోసం జరిగిన ఈవెంట్ లో విశ్వక్ సేన్ తనదైన శైలిలో అల్లు అరవింద్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ నిర్మాతల గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పాలంటూ విశ్వక్ అడిగిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

Allu Aravind: అల్లు అరవింద్ 'వన్ సైడ్ లవ్' స్టోరీలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఓయో రూమ్ కామెంట్స్ వైరల్!
Allu Aravind: అల్లు అరవింద్ 'వన్ సైడ్ లవ్' స్టోరీలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఓయో రూమ్ కామెంట్స్ వైరల్!

"నిర్మాతల జుట్టు ఊడట్లేదేంటి?".. విశ్వక్ ఫన్నీ ప్రశ్న

"సాధారణంగా సినిమాలు నిర్మించే కొద్దీ నిర్మాతల జుట్టు ఊడిపోతుంటుంది. కానీ గీతా ఆర్ట్స్ నిర్మాతలు మాత్రం ఎప్పుడూ చాలా గ్లామర్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. ఆ సీక్రెట్ ఏంటో?" అని విశ్వక్ సేన్ అడగగానే అల్లు అరవింద్ చిరునవ్వు నవ్వారు. వాసు, ధీరజ్ లాంటి వాళ్లందరూ నిర్మాతగా మారిన తర్వాత చాలా స్మార్ట్ గా అవుతున్నారని విశ్వక్ ఈ సందర్భంగా చెప్పాడు.

మళ్లీ ఆడిషన్ ఇస్తా.. నువ్వు డబ్బులు ఎక్కువ అడుగుతున్నావ్..

ఇక గీతా ఆర్ట్స్ లో తనకు ఛాన్స్ ఇవ్వాలని, అవసరమైతే మళ్లీ తొలి సినిమాలాగా ఆడిషన్ ఇస్తానని విశ్వక్ అన్నాడు. దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. నువ్వు ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావ్ అని అన్నారు.

దానికి విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మీ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి కదా సార్.. మాలాంటి వాళ్లకు పంచండి.. ఈ థియేటర్ మీదే.. మీరు కూర్చున్న ఆ కుర్చీ కూడా మీదే.. మాలాంటి వాళ్లకు ఇస్తే ఇండస్ట్రీ బాగుంటది అని విశ్వక్ సరదాగా అన్నాడు. ఇక దిల్‌సుఖ్ నగర్ లో స్టూడియో కట్టాలని, అక్కడ తన స్థలం ఇస్తానని కూడా ఈ సందర్భంగా అల్లు అరవింద్ కు విశ్వక్ చెప్పాడు.

అల్లు అరవింద్ వన్ సైడ్ లవ్ స్టోరీస్

దీవానా సినిమాకు వన్ సైడ్ లవ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అందుకే విశ్వక్ సేన్ ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ తో.. "సార్.. మీ వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పండి" అని అడిగాడు.

దానికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. "ఒకటా.. రెండా..? లెక్కలేనన్ని ఉన్నాయి" అని సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ప్రస్తుత తరం లవ్ స్టోరీలపై ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

"ఇప్పుడు లవ్ స్టోరీ అంటే.. ఖాళీగా ఉన్న థియేటర్లకు వెళ్లడం, షాపింగ్‌కి వెళ్లడం.. చివరకు ఓయో రూమ్‌లో ఎండ్ అవ్వడం.. ఇదే కదా ఇప్పుడు నడుస్తున్న లవ్ స్టోరీ" అని అల్లు అరవింద్ కాస్త వెటకారంగా, ప్రస్తుత పరిస్థితిని ఎద్దేవా చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

దీవానా మూవీ విశేషాలు

శ్రీకాంత్ సంగిశెట్టి డైరెక్ట్ చేసిన దీవానా మూవీ జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై లీడ్ రోల్స్ లో నటించారు. వాసు మూవీని నిర్మించాడు.

హెచ్‌టీ విశ్లేషణ

ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్ మధ్య జరిగిన ఈ సంభాషణలు ఆడియన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్స్ లో వర్క్ చేయాలంటే నటులు ఎంతటి చొరవతో ఉండాలో విశ్వక్ సేన్ తన మాటలతో చూపించారు. అల్లు అరవింద్ పాతకాలపు నిర్మాతగా ఉంటూనే, ఈతరం పరిస్థితులపై ఆయన చేసిన ఓయో రూమ్ కామెంట్స్ ఆయనికున్న అవగాహనను, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను మరోసారి బయటపెట్టాయి.

People Also Ask (FAQs)

విశ్వక్ సేన్ గీతా ఆర్ట్స్ నిర్మాతల గ్లామర్ గురించి ఏమన్నారు?

సినిమాలు తీసే కొద్దీ నిర్మాతల జుట్టు ఊడిపోతుంది, కానీ గీతా ఆర్ట్స్ వారు మాత్రం చాలా గ్లామర్ గా ఉంటారని, ఆ సీక్రెట్ ఏంటని విశ్వక్ సరదాగా అడిగారు.

అల్లు అరవింద్ వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి ఏమని సమాధానమిచ్చారు?

తనకు ఒకటా.. రెండా.. లెక్కలేనన్ని వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉన్నాయని అల్లు అరవింద్ ఫన్నీగా సమాధానమిచ్చారు.

ప్రస్తుత తరం లవ్ స్టోరీల గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్ ఏంటి?

థియేటర్లు, షాపింగ్ మాల్స్ కి వెళ్లడం.. చివరికి ఓయో రూమ్స్ తో కథను ముగించడం ఇప్పుడు లవ్ స్టోరీల ట్రెండ్ అని అల్లు అరవింద్ ఎద్దేవా చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More