దుబాయ్లో అల్లు అర్హ బర్త్డే సెలబ్రేషన్స్.. అల్లు స్నేహారెడ్డి పోస్ట్ వైరల్.. అల్లు అర్జున్ కోసం వెతికిన ఫ్యాన్స్
దుబాయ్లో అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ ఫొటోలను అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసింది. అయితే వీటిని చూసిన ఫ్యాన్స్.. అల్లు అర్జున్ అన్న ఎక్కడ అని అడుగుతున్నారు.
అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అల్లు అర్హ 9 ఏళ్ల పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టింది. అయితే ఆమె బర్త్ డే వేడుకలు ఇండియాలో కాకుండా దుబాయ్లో జరగడం విశేషం. ఈ ఫొటోలను స్నేహ ఇన్స్టాగ్రామ్ లో సోమవారం (నవంబర్ 24) షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి.

అర్హ బర్త్డే సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆమె పుట్టిన రోజు వేడుకల కోసం ఫ్యామిలీ దుబాయ్ వెళ్లడం విశేషం. ఈ ఫొటోలు, వీడియోలను స్నేహ షేర్ చేసింది. “తొమ్మిది సంవత్సరాల గ్రేస్, స్వీట్నెస్, అత్యంత మ్యాజికల్ ఆరా.. వాటర్ ఫన్, కేకులు, మాల్ షాపింగ్ - నిన్ను సెలబ్రేట్ చేసుకోవడం స్వచ్ఛమైన ఆనందం. మై బేబీ గర్ల్.. నువ్వు ప్రతి క్షణాన్ని మెరిసేలా చేస్తావు” అనే క్యాప్షన్ తో స్నేహ ఈ స్పెషల్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది.
అల్లు అర్జున్ కోసం..
అయితే ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ చివరి స్లైడ్ వరకూ వెతుకుతూ వెళ్లినట్లు కామెంట్స్ చేశారు. బన్నీ మాత్రం చివరి స్లైడ్ లో ఓ వీడియోలో పిల్లలతో కలిసి ఓ మాల్ లో నడుచుకుంటూ వెళ్లడం చూడొచ్చు. అది కూడా వెనుక నుంచి ఉంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాట్లాడుతూ బన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక దుబాయ్ లో కొన్ని రోజులు అల్లు ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేసిందీ ఈ పోస్టులో చూడొచ్చు. అర్హ కోసం స్పెషల్ కేకులు, అందంగా డెకొరేట్ చేసిన రూమ్స్, స్విమ్మింగ్ పూల్లో సరదా క్షణాలు వీటిలో కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ బర్త్ డే పోస్టుపై ఓ అభిమాని స్పందిస్తూ.. నీకు ఎన్ని చాక్లెట్లు కావాలన్నా ఇస్తాను.. మీ డాడీ ఫోన్ లో ఏమైనా సినిమా అప్డేట్స్ ఉంటే పంపించు అని అర్హకు ఆఫర్ ఇవ్వడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


