మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి అంబరాన్నంటింది. యంగ్ హీరో అల్లు శిరీష్, తన చిరకాల మిత్రురాలు నయనిక రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 6) రాత్రి హైదరాబాద్లో వీరి వివాహం అత్యంత వైభవంగా, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
తొలి ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్

శిరీష్ వివాహానికి సంబంధించిన మొదటి ఫోటోను అతని బావ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "అల్లు శిరీష్, నయనిక తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు" అని చరణ్ ట్వీట్ చేశాడు.
ఈ ఫోటోలో శిరీష్, నయనిక ఐవరీ కలర్ దుస్తుల్లో మెరిసిపోతుండగా.. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్, ఉపాసన, నిర్మల (శిరీష్ తల్లి), సురేఖ (చరణ్ తల్లి) కూడా ఉన్నారు.
తారల తళతళలు.. ఒకే వేదికపై చిరు, పవన్, అర్జున్
ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్లతో కలిసి సందడి చేశాడు. విశేషం ఏమిటంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహల వివాహం జరిగింది. తమ వెడ్డింగ్ యానివర్సరీ రోజే తమ్ముడి పెళ్లి జరగడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవా, వెంకటేష్, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, సాయి దుర్గ తేజ్, రాశీ ఖన్నా ఈ వేడుకలో మెరిశారు. ఇక కోలీవుడ్ నుంచి స్టార్ హీరో సూర్య, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రత్యేకంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సూర్యను అల్లు అర్జున్ సాదరంగా వేదికపైకి ఆహ్వానించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరై శిరీష్-నయనికలను ఆశీర్వదించారు. గతంలో 'పుష్ప 2' ఘటనపై విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన ఈ వేడుకకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నితిన్ పార్టీలో మొదలైన ప్రేమాయణం
{{/usCountry}}తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరై శిరీష్-నయనికలను ఆశీర్వదించారు. గతంలో 'పుష్ప 2' ఘటనపై విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన ఈ వేడుకకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నితిన్ పార్టీలో మొదలైన ప్రేమాయణం
{{/usCountry}}శిరీష్, నయనికల పరిచయం 2023లో హీరో నితిన్, అతని భార్య శాలిని ఇచ్చిన ఒక పార్టీలో (వరుణ్ తేజ్-లావణ్యల కోసం ఇచ్చిన విందు) మొదలైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు దారితీసింది. పెళ్లికి ముందు దుబాయ్లో ఫ్రెండ్స్ కోసం బ్యాచిలర్ పార్టీ, హైదరాబాద్లోని అల్లు స్టూడియోస్లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించారు. అలాగే పసుపు దంచడం, మంగళ స్నానం వంటి సంప్రదాయ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.