...
...
Next Story

32 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. దెయ్యమే చంపిందా.. హారర్ లవర్స్ ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే.. రియల్ స్టోరీ

ఓటీటీలోకి తాజాగా వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మంచి థ్రిల్ పంచుతోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. గౌరవ్ తివారీ అనే ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కథ. 32 ఏళ్లకే కన్నుమూసిన అతన్ని దెయ్యాలే చంపాయా అన్నదే అసలు మిస్టరీ.

Published on: Dec 14, 2025, 20:03:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం తాజాగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓ సిరీస్ తీసుకొచ్చింది. దీనిపేరు భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో 8.8 రేటింగ్ సాధించింది. 2016లో చనిపోయిన గౌరవ్ తివారీ అనే పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ జీవితం చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఎలా ఉందో తెలుసుకోండి.

భయ్: ది గౌరవ తివారీ మిస్టరీ కథ ఇదీ

32 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. దెయ్యమే చంపిందా.. హారర్ లవర్స్ ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే.. రియల్ స్టోరీ
32 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. దెయ్యమే చంపిందా.. హారర్ లవర్స్ ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే.. రియల్ స్టోరీ

గౌరవ్ తివారీ.. మన దగ్గర చాలా కొద్ది మందికే తెలిసిన వ్యక్తి. బీహార్ లోని పాట్నాలో 1984లో జన్మించిన ఈ వ్యక్తి.. పైలట్ జాబ్ వదిలి తనకు ఎంతగానో ఇష్టమైన దెయ్యాల వేట సాగించాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఎన్నో అలాంటి కేసులను పరిష్కరించాడు. అతని జీవితం ఆధారంగా తెరకెక్కిందే ఈ భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్.

దీనిని అభిరూప్ ధర్ రాసిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ ఫోర్‌మోస్ట్ పారానార్మల్ ఇన్టెస్విగేటర్ అనే బుక్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. ఇందులో కరణ్ టాకర్, కల్కి కొచ్లిన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

గౌరవ్ తివారీ అసలు ఎందుకు తన పైలట్ జాబ్ వదిలిపెట్టాడు? అసలు ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద అతనికి ఎందుకు ఆసక్తి కలిగింది? మెటాఫిజికల్ చర్చ్ ఆఫ్ హ్యూమనిస్టిక్ సైన్స్ లో అతడు నేర్చుకున్నది ఏంటి? తన జీవితంలో అతడు పరిష్కరించిన ఘోస్ట్ హంటింగ్ కేసులు ఏవి అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. అంతేకాదు 32 ఏళ్ల వయసులోనే 2016లో అతడు ఎలా మరణించాడన్నది కూడా ఈ సిరీస్ లో చూపించారు.

గౌరవ్ తివారీ ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కావడంతో అతని మరణం కూడా అప్పట్లో చాలా మందిలో అనుమానాలు రేకెత్తించింది. అతన్ని హత్య చేశారని, అది కూడా దెయ్యాలే కావచ్చనీ అనుకున్నారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ పోలీసులు అతనిది ఆత్మహత్యగా తేల్చినా.. అతని మరణం చుట్టూ మిస్టరీ మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే బేస్ చేసుకొని ఈ భయ్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు.

ఇందులోని హరర్ ఎలిమెంట్స్ మంచి థ్రిల్ పంచేలా సాగాయి. కథలో ముందుకు, వెనక్కి తీసుకెళ్తూ అసలు గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడు? ఏం జరిగిందన్న ఆసక్తిని చివరి ఎపిసోడ్ వరకూ కొనసాగేలా చేయడంలో డైరెక్టర్ రాబీ గ్రేవాల్ సక్సెస్ అయ్యాడు. ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా తన జీవితంలో గౌరవ్ తివారీ ప్రతి రోజూ ఎలాంటి భయానక అనుభవాలను ఎదుర్కొన్నాడన్నది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.

మొత్తం 8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ సీట్లకు అతుక్కుపోయి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. రాబీ గ్రేవాల్ డైరెక్షన్, అర్షయ్ సయ్యద్ స్క్రీన్ ప్లే, లీడ్ రోల్స్ అయిన కరణ్ టాకర్, కల్కి కొచ్లిన్ నటన అద్భుతమని చెప్పొచ్చు. ఓ మంచి పారానార్మల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe