Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముంబయిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శనివారం ఆయన కుడి భుజానికి వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. కుడి భుజానికి ఉన్న రొటేటర్ కఫ్ కండరాల గాయంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో వైద్యులు ఈ భారీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శనివారం కుడి భుజానికి సర్జరీని పూర్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
“ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు” అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స నుంచి త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం కావడం సంతోషకరం. ఆయన పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఆయనకు మానసిక ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు నాయుడు తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
{{/usCountry}}"ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం కావడం సంతోషకరం. ఆయన పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఆయనకు మానసిక ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు నాయుడు తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
{{/usCountry}}