AR Rahman Peddi: ఆ 'కిస్సింగ్ సీన్' చరణ్ నేచురల్గా చేశారు.. ‘పెద్ది’ మూవీపై రెహమాన్ సంచలన వ్యాఖ్యలు.. తమన్పై ప్రశంసలు
AR Rahman Peddi: పెద్ది సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్.. రామ్ చరణ్ యాక్టింగ్ పై, ముఖ్యంగా ఒక కిస్సింగ్ సీన్పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గ్రోత్ పై కూడా రెహమాన్ చాలా గర్వంగా మాట్లాడారు.
AR Rahman Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi). జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న ఏఆర్ రెహమాన్ చేసిన కొన్ని క్రేజీ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.

చరణ్ ఆ క్యారెక్టర్లో జీవించేశారు: ఏఆర్ రెహమాన్
సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి రెహమాన్ మాట్లాడుతూ ఎక్స్లెంట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
"నేను ఆ సీన్స్ చూసినప్పుడు.. 'ఈ సీన్లను చరణ్ ఎలా చేయగలడు? ఆ ఎమోషన్ను ఎలా ఫీల్ అవుతాడు?' అని బాగా సర్ ప్రైజ్ అయ్యాను. కానీ ఆయన వాటన్నింటినీ చాలా నేచురల్ గా చేసేశారు. చివరికి ఆ 'కిస్సింగ్ సీన్' కూడా చాలా నేచురల్గా కంప్లీట్ చేసేశారు. అది చూశాక చరణ్ ఆ క్యారెక్టర్ లో పూర్తిగా జీవించేశాడని నాకు అనిపించింది" అని రెహమాన్ కొనియాడారు.
'పెద్ది' అంటే కేవలం ఆట కాదు.. మనుషుల స్పిరిట్!
ఇదే ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు.. "సార్, ఈ 'పెద్ది' స్టోరీ నుండి ఆడియన్స్ థియేటర్ల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?" అని అడగగా.. రెహమాన్ చాలా లోతుగా విశ్లేషించారు.
మనుషులలో ఉండే పట్టుదల, ఆత్మవిశ్వాసాల ఎదుగుదలే ఈ సినిమా మెయిన్ సోల్ అని.. పెద్ది పాత్రలో స్పోర్ట్స్ లో పాలీమ్యాత్ అంటూ ఆల్ రౌండర్ అని కొనియాడారు. బుచ్చిబాబు డైరెక్షన్ టాలెంట్ ను మెచ్చుకుంటూ.. “నీ పనే నిన్ను డిఫైన్ చేస్తుంది, నీ ఎక్స్పీరియన్స్ కాదు” అంటూ రెహమాన్ ఒక పవర్ఫుల్ కోట్ చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్పై రెహమాన్ ప్రశంసలు
ఈ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురపించారు. తమన్ పుట్టకముందు నుంచే తమ రెండు కుటుంబాలు ఇరుగు పొరుగు అని రెహమాన్ గుర్తుచేసుకున్నారు.
"అలాంటి తమన్ ఈరోజు మ్యూజిక్ వరల్డ్ లో ఇంత పెద్ద స్థాయికి ఎదగడం, అంతటి ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ ఇస్తుండడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది" అంటూ కాంప్లిమెంట్స్ కురిపించారు.
రెహమాన్ లాంటి లెజెండ్ నోటి వెంట ఈ మాటలు రావడంతో మెగా ఫ్యాన్స్, తమన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ను తెగ షేర్ చేస్తూ 'గూస్బంప్స్' మూమెంట్ అంటూ రచ్చ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హెచ్టీ విశ్లేషణ
ఒక పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ కి ఇలాంటి ఆర్గానిక్ బజ్ చాలా హెల్ప్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ లాంటి ఇంటర్నేషనల్ ఐకాన్ చరణ్ యాక్టింగ్ గురించి, అందులోనూ కిస్సింగ్ సీన్, ఎమోషన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడటం ఆడియన్స్ లో క్యూరియాసిటీని అమాంతం పెంచుతుంది.
అలాగే తమన్ గురించి రెహమాన్ చేసిన కామెంట్స్ కూడా అభిమానులపై అంతే ప్రభావం చూపుతుంది. తమన్ తోపాటు దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ల నుంచి తాను కూడా ఇన్స్పైర్ అవుతానని రెహమాన్ చేసిన కామెంట్స్ అతని సింప్లిసిటీ గురించి చెప్పకనే చెబుతున్నాయి.
People Also Ask (FAQs)
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏఆర్ రెహమాన్ ఏమన్నారు?
రామ్ చరణ్ చాలా కష్టమైన ఎమోషనల్ సీన్లను, చివరికి ఒక 'కిస్సింగ్ సీన్'ను కూడా ఎంతో నేచురల్ గా చేసేశారని, ఆయన 'పెద్ది' పాత్రలో జీవించేశారని రెహమాన్ ప్రశంసించారు.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ఏం చెప్పారు?
తమన్ పుట్టకముందు నుంచే తమ కుటుంబాలు పొరుగువారేనని చెబుతూ.. ఇప్పుడు తమన్ మ్యూజిక్ వరల్డ్ లో సాధిస్తున్న అద్భుతమైన గ్రోత్, ఆయన ఇస్తున్న ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ చూసి తాను చాలా గర్వపడుతున్నానని రెహమాన్ ఎమోషనల్ అయ్యారు.
'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?
ఈ మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


