Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్.. కాబోయే భార్యపై ఎమోషనల్ పోస్ట్.. బ్యూటిఫుల్ అంటూ కాజల్ కామెంట్
Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ తన కాబోయే భార్య, నిశ్చితార్థంపై చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కామెంట్స్ చేశారు.
Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనిపై తాజాగా మంగళవారం (ఏప్రిల్ 7) అతడు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ క్షణం నుంచి అంతా మారిపోయింది అంటూ అతడు చేసిన ఎమోషనల్ పోస్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. కాజల్ కూడా దీనిపై స్పందిస్తూ బ్యూటీఫుల్ అని కామెంట్ చేసింది.

"ఈ క్షణం నుండి అంతా మారిపోయింది.."
బెల్లంకొండ శ్రీనివాస్ తన నిశ్చితార్థ వేడుక ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశాడు. "ఈ క్షణం నుండి ప్రతిదీ మారిపోయింది.. నిండు మనసులతో, ఒకరి కళ్లలో ఒకరం చూసుకుంటూ మేము ఎప్పుడూ నమ్మే ఒక శాశ్వతమైన బంధంలోకి అడుగుపెట్టాం. ఎటువంటి హడావుడి, ఆర్బాటం లేకుండా.. కేవలం మా మధ్య ఉన్న ప్రేమతో ఈ వేడుక ఎంతో అందంగా జరిగింది. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం" అని అతడు అన్నాడు. 'అజూర్ కోవ్' (Azure Cove) అనే అందమైన ప్రదేశంలో ఈ వేడుక జరిగినట్లు అతడు ట్యాగ్ చేశాడు.
బ్యూటీఫుల్ అన్న కాజల్
బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ పోస్ట్ పై ఎంతో మంది అభిమానులతోపాటు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ లాంటి హీరోయిన్లు కూడా స్పందించారు. బ్యూటీఫుల్ అంటూ కామెంట్ చేసిన కాజల్.. ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది.
అటు ప్రగ్యా కూడా మూడు హార్ట్ ఎమోజీలతో ఈ పోస్టుపై రియాక్ట్ అయింది. ఇక ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేశారు. ఈ ఫొటోల్లో శ్రీనివాస్ తన కాబోయే భార్యను చూస్తూ ఎంతో ఆనందంగా కనిపించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ కాబోయే భార్య
బెల్లకొండ శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యను గతంలోనే పరిచయం చేశాడు. వాళ్లకు ఎంగేజ్మెంట్ ఎప్పుడో జరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఇది కేవలం తన కాబోయే భార్య పరిచయమే అని అప్పట్లో అతడు చెప్పాడు. కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కావ్య రెడ్డిని కావ్యమ్మా అని పిలుస్తూ అందమైన నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.
"నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, నా జీవితాన్ని పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాసుకొచ్చాడు.
"ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అది ఎంగేజ్మెంట్ కాదు. కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్మెంట్ మాత్రమే. వేడుకలు ఇక ప్రారంభం కానున్నాయి. డేట్స్ను త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, సహకారమే నా ప్రపంచం" అంటూ అభిమానులు, ప్రేక్షకుల గురించి రాసుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


